తెలంగాణ కోసం ఆత్మహత్య కాదు..హత్య!!
posted on Jul 23, 2013 12:03PM
తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్ధి వినోద్ కేసు సడన్ గా మలుపు తిరిగింది. వినోద్ ఆత్మహత్య చేసుకోలేదని..అతనిని గొంతునులిమి హత్య చేసి కాల్చేసారని పోలీసులు చెబుతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ విషయం బయటపడిందని పోలీసులు వాదిస్తున్నారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి సీఐ గిరిబాబు మాట్లుడుతూ.. బీటెక్ స్టూడెంట్ వినోద్ ను ఎవరో పథకం ప్రకారం హత్య చేసి తెలంగాణ రంగు పూలమడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతుందని...మృతుదేహం పోస్ట్ మార్టానికి వెళ్ళడంతో అసలు విషయం బయట పడిందని అంటున్నారు. ఈ హత్యకు రాజకీయమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన వినోద్..చిన్నాన్న సర్పంచ్ గా పోటి చేస్తుండడంతో ప్రచార౦ కోసం గ్రామానికి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసిన వినోద్..ఇంటి వెనుక పశువుల పాకలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.